News29th Apr 04:08 PMSunil Byrisetty1 min read

ప్రాజెక్టులు వస్తున్నాయి.. అండగా నిలవాలి

రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓవైపు స్వర్ణాంధ్ర-20

ప్రాజెక్టులు వస్తున్నాయి.. అండగా నిలవాలి
రాబోయే నాలుగేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంపద సృష్టి, పేదరిక నిర్మూలన లక్ష్యంగా పెద్దఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఓవైపు స్వర్ణాంధ్ర-2047 విజన్‌కు అనుగుణంగా పనిచేస్తూనే... మరోవైపు 2029 కల్లా పూర్తి చేయాల్సిన ప్రాజెక్టులు, లక్ష్యాలపై ప్రధానంగా దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దీనికి బ్యాంకులు సంపూర్ణ మద్దతివ్వాలని, 2025-26లో నిర్దేశించుకున్న క్రెడిట్ ప్లాన్‌ లక్ష్యాలను అధిగమించేలా కృషి చేయాలని కోరారు. మంగళవారం సచివాలయంలో జరిగిన 231వ స్టేట్ లెవెల్ బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి ఈ మేరకు సూచించారు. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో సాధించిన ఫలితాలపై బ్యాంకింగ్ అధికారులతో చర్చించిన ముఖ్యమంత్రి, 2025-26 లక్ష్యాలను నిర్దేశించారు. నూరు శాతం లక్ష్యాలను అధిగమించి దక్షిణ భారతదేశంలోనే మేటిగా ఉన్నందుకు ముఖ్యమంత్రి బ్యాంకర్లను అభినందించారు. సమావేశంలో 2025-2026 ఆర్ధిక సంవత్సరానికి ‘ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్‌’ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ... డ్వాక్రా మహిళలు, కౌలు రైతులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఎదుగుదలకు ప్రత్యేకంగా ఏం చేయగలం అనేది బ్యాంకర్లు ఆలోచించాలని చెప్పారు.
Andhra Pradesh Credit Plan 2025-26
Chandrababu Naidu
Swarnandhra-2047 vision
SLBC meetings
స్వర్ణాంధ్ర-2047 విజన్‌
‘ఏపీ యాన్యువల్ క్రెడిట్ ప్లాన్‌
Scroll for the next article