News17th Jul 04:24 PMSunil Byrisetty1 min read

రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం

రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై ADCL అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమ్యూజెంట్ పార్కు,ఎక

రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం
రాజధానిలో రివర్ ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై ప్రభుత్వం ఫోకస్ సారించింది. అమరావతిలో చేపట్టే టూరిజం ప్రాజెక్టులపై ADCL అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమ్యూజెంట్ పార్కు,ఎకో టూరిజం పార్కుల ను పీపీపీ విధానంలో ADCL అభివృద్ధి చేయనుంది. అమరావతిలో రోడ్లు,భవనాలు నిర్మాణం పూర్తయ్యేసరికి టూరిజం ప్రాజెక్టులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. సీఎం చంద్రబాబు సూచనలను పరిగణనలోకి తీసుకుని పర్యాటకులను ఆకర్షించేలా ప్రాజెక్టులు వేగవంతం చేయాలని కోరారు. ఇప్పటికే టూరిజం ప్రాజెక్టులు కోసం భూములు కేటాయించిన మిగిలిన సంస్థలు కూడా త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని మంత్రి సూచించారు.
Andhra Pradesh
Amaravati
Riverfront Tourism
AP Government
Narayana
Chandrababu Naidu
ADCL
Tourism Development
అమ్యూజ్‌మెంట్ పార్క్
రాజధాని అభివృద్ధి
ఆంధ్రప్రదేశ్
మౌలిక సదుపాయాలు
Scroll for the next article