News21st Jul 04:45 PMSunil Byrisetty1 min read
పురపాలక ఔట్సోర్సింగ్ వర్కర్ల వేతనం పెంపు
పురపాలక శాఖ పరిధిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్ర
పురపాలక శాఖ పరిధిలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పని చేస్తున్నఉద్యోగుల విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నాన్ పీహెచ్ వర్కర్ల వేతనం పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం ప్రకటించింది. కేటగిరీ-1 వర్కర్ల వేతనం రూ.21,500 నుంచి 24,500కు పెంచింది. కేటగిరీ-2 వర్కర్ల వేతనం రూ.18,500 నుంచి రూ.21,500 పెంచుతున్నట్లు ప్రకటించింది. కేటగిరీ-3 వర్కర్ల వేతనం రూ.15 వేల నుంచి రూ.18,500కు పెంచింది. ఈ మేరకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.