News16th Jul 05:20 PMSunil Byrisetty1 min read
‘తల్లికి వందనం’కు ఉత్తర్వులు
తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకానికి సంబంధించి రూ.10,120.7
తల్లికి వందనం పథకం ఈ విద్యా సంవత్సరానికి వర్తింపజేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ పథకం వర్తించనుంది. ఈ పథకానికి సంబంధించి రూ.10,120.78 కోట్ల చెల్లింపునకు విద్యాశాఖ అనుమతినిచ్చింది. ఈ పథకం ద్వారా 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. 42,70,802 మంది తల్లుల బ్యాంకు ఖాతాలకు మొత్తం జమకానుంది. ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు చదువుతున్నా అందరికీ పథకం వర్తించనుంది.