News27th Apr 12:28 PMSunil Byrisetty1 min read
ఇక రేషన్లో రాగులు, కంది!
రేషన్ కార్డు మీద బియ్యంతోపాటు కందిపప్పు, రాగులు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి ప్రాధాన్యమిస్తూ పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన
రేషన్ కార్డు మీద బియ్యంతోపాటు కందిపప్పు, రాగులు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది.
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యానికి ప్రాధాన్యమిస్తూ పేదలకు పోషక విలువలతో కూడిన కందిపప్పు, తృణధాన్యాలను ప్రభుత్వం ఇస్తామన్న సంగతి తెలిసిందే.
జూన్ నుంచి రేషన్ సరుకులతో పాటు సబ్సిడీపై కేజీ కందిపప్పు, ఉచితంగా రాగులు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
ఈ క్రమంలో ఏడాదికి సరిపడా రాగులు, మూడు నెలలకు సరిపడా కందిపప్పు సేకరణకు టెండర్లు ఆహ్వానించింది.