News22nd Jan 03:21 PMSunil Byrisetty1 min read
ఏపీ ప్రభుత్వం శుభవార్త.. వారి అకౌంట్లోకి నగదు!
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్లో ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక నిధులను విడుదల చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ నిర్
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది. పెండింగ్లో ఉన్న పరిశ్రమల ప్రోత్సాహక నిధులను విడుదల చేసి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిన్న, మధ్య తరహా పరిశ్రమల యజమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పారిశ్రామిక రంగంలో వెనుకబడిన వర్గాలను ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రోత్సాహకాలను అమలు చేస్తోంది. తాజాగా ప్రభుత్వం రూ 60.21 కోట్లను విడుదల చేసింది. ఈ మొత్తంతో 3,122 మంది ఎస్సీ పారిశ్రామికవేత్తలు, 495 మంది ఎస్టీ పారిశ్రామికవేత్తలు లబ్ధి పొందారు.