News12th Aug 08:56 AMSunil Byrisetty1 min read
ఇన్ఛార్జి మంత్రులకు కీలక బాధ్యతలు
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ, ఉచిత బస్సు పథకం ప్రారంభం
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జిల్లా ఇన్ఛార్జి మంత్రులకు బాధ్యతల్లో మార్పులు, చేర్పులు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆగస్టు 15న జెండా ఆవిష్కరణ, ఉచిత బస్సు పథకం ప్రారంభంలో కీలకంగా వ్యవహరించాలని పేర్కొంది. సొంత జిల్లాలోనే జెండా ఆవిష్కరించాలని అక్కడే ఉచిత బస్సు పథకాన్ని ప్రాంభించాలని ఆదేశాలు జారీ చేసింది. గతంలో ఏ జిల్లాకు ఇన్ఛార్జి మంత్రిగా ఉంటే ఆ జిల్లాలోనే మంత్రులు జెండా ఆవిష్కరించేవారు. ఉచిత బస్సు పథకం నేపథ్యంలో సొంత జిల్లాలోనే పాల్గొనాలని ఆదేశాలు జారీ చేసింది.