News28th Jan 12:33 PMSunil Byrisetty1 min read
ఉద్యానవన క్లస్టర్లుగా 10 జిల్లాలు
రాష్ట్రంలో ఉద్యానవన కేంద్రాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 10 జిల్లాలను ఉద్యానవన రంగ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి సంబంధిత అధికారులతో సమావేశం నిర్
రాష్ట్రంలో ఉద్యానవన కేంద్రాల అభివృద్ధిపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు 10 జిల్లాలను ఉద్యానవన రంగ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ నిర్ణయంతో రాయలసీమ ప్రాంతానికి లబ్ధి చేకూరనుంది. ఏపీలో రాయలసీమ ప్రాంతంతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాలను ఉద్యానవన కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. 10 జిల్లాలను ఉద్యానవన రంగ కేంద్రాలుగా అభివృద్ధి చేయడానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళికలపై మంత్రులు, సీనియర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ‘రాయలసీమ ప్రాంతం ఇప్పటికే ఉద్యానవన ఉత్పత్తిలో దేశంలో అగ్రగామిగా ఉంది. ప్రకాశం, మార్కాపురం జిల్లాలతో పాటు ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద ఉద్యానవన క్లస్టర్గా అభివృద్ధి చేయాలి. ప్రపంచ మార్కెట్ డిమాండ్ ప్రకారం ఉద్యానవన ఉత్పత్తిని ప్రోత్సహించాలి. 500 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉద్యానవన ఉత్పత్తులను ఉత్పత్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలి.’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.