News2nd Oct 03:56 PMSunil Byrisetty1 min read

సోషల్ మీడియాపై మంత్రుల కమిటీ

సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ దూషించే ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సోషల్ మీడియా నియంత్రణ, బాధ్యత, పౌర హక్కుల రక్షణ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన చేయడాని

సోషల్ మీడియాపై మంత్రుల కమిటీ
సోషల్ మీడియాలో టార్గెట్ చేస్తూ దూషించే ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. సోషల్ మీడియా నియంత్రణ, బాధ్యత, పౌర హక్కుల రక్షణ వంటి అంశాలపై సమగ్ర పరిశీలన చేయడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిటీలో మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, వంగలపూడి అనిత సభ్యులు. ఈ కమిటీ భారత్‌లో సోషల్ మీడియా కోసం ఉన్న చట్టాలు, నిబంధనలు, మార్గదర్శకాలను సమీక్షిస్తుంది. అంతర్జాతీయ విధానాలను అధ్యయనం చేసి, పారదర్శకత, ప్లాట్‌ఫార్ముల బాధ్యత, వినియోగదారుల రక్షణ వంటి అంశాలపై విశ్లేషణ చేయనుంది. హానికర కంటెంట్, తప్పుడు సమాచారం, ఆన్‌లైన్ దాడులు, జాతీయ భద్రతకు ముప్పుగా ఉన్న అంశాలను నియంత్రించడానికి సూచనలు ఇస్తుంది. ఫిర్యాదులు పరిష్కరించడానికి స్పష్టమైన విధానం సూచించనుంది.
Andhra Pradesh
Social Media Regulation
Ministers Committee
AP Government
Online Safety
Digital Rights
Cyber Security
Misinformation
Harmful Content
సోషల్ మీడియా విధానం
భారత డిజిటల్ చట్టాలు
ఆన్‌లైన్ బాధ్యత
జాతీయ భద్రత
Scroll for the next article