Politics19th Nov 04:09 PMSunil Byrisetty1 min read

చెవిరెడ్డికి షాక్.. ఆస్తుల జప్తు!

ఏపీ మద్యం కుంభకోణంలో ప్రభుత్వం వైసీపీకి షాకిచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చే

చెవిరెడ్డికి షాక్.. ఆస్తుల జప్తు!
ఏపీ మద్యం కుంభకోణంలో ప్రభుత్వం వైసీపీకి షాకిచ్చింది. లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) చేసిన సిఫార్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. భాస్కర్ రెడ్డితో పాటు ఆయన కుమారులు మోహిత్ రెడ్డి, హర్షిత్ రెడ్డి, కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మి పేరిట ఉన్న చర, స్థిరాస్తులన్నింటినీ జప్తు చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని భూములు, ఇతర ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. మద్యం కుంభకోణం ద్వారా చెవిరెడ్డి కుటుంబం అక్రమ మార్గాల్లో భారీగా ఆస్తులు కూడబెట్టిందని సిట్ తన విచారణలో గుర్తించింది. సుమారు రూ. 54.87 కోట్ల నల్లధనాన్ని అధికార అండతో భూ లావాదేవీల ద్వారా మళ్లించినట్టు సిట్ నిర్ధారించింది. ఈ మేరకు సిట్ చేసిన విజ్ఞప్తి ఆధారంగా హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్ అవినీతి నిరోధక చట్టం కింద ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
AP Liquor Scam
Chevireddy Bhaskar Reddy
YSRCP
Property Seizure
SIT Investigation
Andhra Pradesh Government
Corruption Case
Illegal Assets
అక్రమ ఆస్తులు
నల్లధనం
తిరుపతి
నెల్లూరు
చిత్తూరు
Scroll for the next article