News6th May 12:36 PMSunil Byrisetty1 min read
విశాఖ మెట్రో రైల్..శరవేగం!
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది. ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తికి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీ మెట్రో ర
విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగంగా ముందుకు వెళ్తోంది.
ప్రాజెక్ట్ ప్లానింగ్, టెండర్ల ప్రక్రియ, పనుల పర్యవేక్షణ, ప్రాజెక్ట్ పూర్తికి కన్సల్టెన్సీ ఎంపిక కోసం ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు పిలిచింది.
టెండర్లకు సంబంధించి ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది.
ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ నిర్వహించిన సమావేశానికి మొత్తం 28 దేశీయ, విదేశీ కన్సల్టెన్సీల ప్రతినిధులు హాజరయ్యారు.
నేరుగా 14 సంస్థలు హాజరు కాగా, ఆన్లైన్లో 8 సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
జూన్ 9వ తేదీన ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ టెండర్లు ఓపెన్ చేసి కన్సల్టెన్సీని ఎంపిక చేయనుంది.
కన్సల్టెన్సీ ఎంపిక తర్వాత ప్రాజెక్ట్ ప్రక్రియ ఊపందుకోనుంది.