News26th Sep 11:56 AMSunil Byrisetty1 min read
ఆటో డ్రైవర్ల ఖాతాల్లో 15 వేలు.. ఎప్పుడంటే
ఏపీ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ 15 వేలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కోసం మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గాంధీ జ
ఏపీ ప్రభుత్వం ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ 15 వేలు జమ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది. ఈ పథకం కోసం మొత్తం 3,10,385 మందిని అర్హులుగా అధికారులు గుర్తించినట్లు తెలిసింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబరు 2న వీరి ఖాతాల్లో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా నిధులు జమ చేస్తారు. రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలవుతున్న నేపథ్యంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. వీటిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని, వారి ఖాతాల్లో నగదు జమ చేయనుంది.