Education28th Oct 05:28 PMSunil Byrisetty1 min read
బాధ్యత గల పౌరులుగా ఎదగండి
ఉన్నత ఉద్యను పూర్తి చేసిన ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ముధుమూర్తి పిలుపునిచ్చారు. జాతి నిర్మాణం, దేశాభివృద్ధిలో
ఉన్నత ఉద్యను పూర్తి చేసిన ప్రతి విద్యార్థి సమాజంలో బాధ్యత గల పౌరులుగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ముధుమూర్తి పిలుపునిచ్చారు. జాతి నిర్మాణం, దేశాభివృద్ధిలో భాగస్వామ్యం పెరగాలని కోరారు. ప్రపంచస్థాయి సంస్థల్లో కీలక పాత్ర పోషించేందుకు అవసరమైన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలని సూచించారు. మంగళవారం ఉదయం నీరుకొండలోని ఏపీ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ 5 వ స్నాతకోత్సవానికి డా. మధు మూర్తి ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. యూనివర్సిటీ కులపతి డాక్టర్ టి ఆర్ పారవేందర్ అధ్యక్షతన జరిగిన స్నాతకోత్సవంలో మధు మూర్తి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఎస్ఆర్ఎం వంటి అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలో బీటెక్ చదువులు పూర్తి చేసిన విద్యార్థులకు టిసిఎస్, కాగ్నిజెంట్,గూగుల్ వంటి దిగ్గజ సంస్థలు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నాయన్నారు.