News28th Jan 01:29 PMSunil Byrisetty1 min read
"వింగ్స్ ఇండియా - 2026"లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో "వింగ్స్ ఇండియా - 2026" ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్ట
హైదరాబాద్ బేగంపేట ఎయిర్ పోర్టులో "వింగ్స్ ఇండియా - 2026" ప్రారంభ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుతో కలిసి ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులు & మౌలిక సదుపాయాల శాఖ తరపున ఏపీ ఎడిసిఎల్ ప్రాంగణంలో పలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఏపీ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్టాల్ ను ప్రారంభించి.. అనంతరం స్టాల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా జిఎంఆర్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన స్టాల్ ను సందర్శించారు.
అనంతరం ఏవియేషన్ రంగంలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అపార అవకాశాలను మంత్రి వివరించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ రంగంలో పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుతుందని మంత్రి ఆకాంక్షించారు.