News28th Sep 03:17 PMSunil Byrisetty1 min read

దక్షిణ కొరియా పర్యటనలో వాగును పరిశీలించిన మంత్రులు

దక్షిణ కొరియా పర్యటనలో "చియాంగ్‌గేచెఒన్" వాగును ఏపీ మంత్రులు పరిశీలించారు. ఏపీ ఈడీబీ (ఎకనామిక్ డెవెలప్మెంట్ బోర్డు)ఆధ్వర్యంలో దక్షిణ కొరియా పర్యటనలో ఆ దేశ రాజధాని సీయోల్ సహచర మంత్ర

దక్షిణ కొరియా పర్యటనలో వాగును పరిశీలించిన మంత్రులు
దక్షిణ కొరియా పర్యటనలో "చియాంగ్‌గేచెఒన్" వాగును ఏపీ మంత్రులు పరిశీలించారు. ఏపీ ఈడీబీ (ఎకనామిక్ డెవెలప్మెంట్ బోర్డు)ఆధ్వర్యంలో దక్షిణ కొరియా పర్యటనలో ఆ దేశ రాజధాని సీయోల్ సహచర మంత్రి పి. నారాయణతో కలిసి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించారు. 90వ దశకంలో పూర్తిగా మురుగునీటితో, తీవ్ర కాలుష్యకారకంగా ఉండి అత్యంత పరిశుభ్రంగా మారిన "చియాంగ్‌గేచెఒన్" వాగును పరిశీలించారు. అమరావతితో పాటు పట్టణాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై అధ్యయనం చేయనున్నారు. గతంలో అత్యంత మురికిగా, కాలుష్య కారకంగా ఉండే"చియాంగ్‌గేచెఒన్" వాగులోని నీరు.. నేడు పునరుద్ధరణ తర్వాత ఎంతో స్వచ్ఛంగా మారడం, గాలి నాణ్యత పెరగడం, శబ్ద కాలుష్యం తగ్గడం.. తద్వారా జీవవైవిధ్యం మెరుగుపడటం ఈ వాగు పునరుద్ధరణలో ప్రత్యేకత అని తెలుసుకున్నారు. రాష్ట్రంలో కాలుష్య కారకంగా మారిన నదులు, కాలువలు, వాగులు వంటి వాటిని పునరుద్ధరించే కోణంలో ఈ వాగు గురించి అధ్యయనం చేస్తున్నారు.
Andhra Pradesh
South Korea
Cheonggyecheon
Urban. Development
Water body restoration
Pollution control
Environmental conservation
Clean water
Sustainable cities
EDB
పరిశుభ్ర నీరు
సుస్థిర నగరాలు
ఈడీబి
పట్టణ అభివృద్ధి అధ్యయనం
Scroll for the next article