News1st Aug 11:06 AMSunil Byrisetty1 min read
విడుదలైన కానిస్టేబుల్ ఫలితాలు
ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ నియామకాల ఫలితాలు విడుదలయ్యాయి. హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీ
ఆంధ్రప్రదేశ్లో పోలీసు కానిస్టేబుల్ నియామకాల ఫలితాలు విడుదలయ్యాయి. హోం మంత్రి అనిత, ఏపీ డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఫలితాలను విడుదల చేశారు. ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://slprb.ap.gov.in/లో ఫలితాలను అందుబాటులో ఉంచినట్టు తెలిపారు. ఫలితాల్లో గండి నానాజి 168 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్లు అధికారులు ప్రకటించారు. జి.రమ్య మాధురి 159 మార్కులతో రెండో స్థానం, మెరుగు అచ్యుతారావు 144.5 మార్కులతో మూడో స్థానంలో నిలిచారు. ఈ రిక్రూట్మెంట్ ద్వారా 6,100 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ కానున్నాయి.