News16th Apr 09:40 AMSunil Byrisetty1 min read
ఐక్యరాజ్య సమితికి ఏపీ.. కీలక ఒప్పందం
ఆంధ్రా ప్రభుత్వం మరో కీలక ముందడుగేసింది. ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై అవగాహన ఒ
ఆంధ్రా ప్రభుత్వం మరో కీలక ముందడుగేసింది.
ఐక్యరాజ్య సమితి ప్రపంచ ఆహార పథకం సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.
వాతావరణ మార్పులను తట్టుకునే వ్యవసాయ రంగానికి సంబంధించి పలు అంశాలపై అవగాహన ఒప్పందాలు చేసుకుంది.
ప్రపంచ ఆహార పథకం డైరెక్టర్ ఎలిజబెత్ ఫెయిరీ, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బుడితి రాజశేఖర్ ఈ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
దేశంలో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు రాష్ట్రాలలో 5 ఏళ్ల వరకు అమలు చేయనున్నట్లు ఐరాస ప్రతినిధి తెలిపారు.
సన్న, చిన్న కారు, మహిళా రైతులను వ్యవసాయ రంగంలో మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అవసరమైన వ్యవసాయ పరిజ్ఞానాన్ని అందించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాజశేఖర్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందంతో రైతులు వాతావరణ వ్యతిరేక పరిస్థితుల నుంచి తమ పంటలను రక్షించుకునే అవకాశం