News9th Apr 01:40 PMSunil Byrisetty1 min read
సూక్ష్మ సేద్యంలో ఏపీ నెంబర్ వన్
దేశంలో సూక్ష్మ సేద్యం విధానంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలిచింది ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 17 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నంబర్-1గా నిలిచింది. ఆ తర్వాత
దేశంలో సూక్ష్మ సేద్యం విధానంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్గా నిలిచింది ఈ ఆర్థిక సంవత్సరంలో లక్షా 17 వేల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం అమలు చేసి దేశంలోనే ఏపీ నంబర్-1గా నిలిచింది.
ఆ తర్వాతి స్థానాల్లో గుజరాత్(1.16 లక్షల హెక్టార్లు), ఉత్తర ప్రదేశ్ (1.02 లక్షల హె,), కర్ణాటక (97 వేల హె), తమిళననాడు (91 వేల హె,) ఉన్నాయి.
బిందు, తుంపర్ల పరికరాల కోసం కేంద్రం, ఏపీ ప్రభుత్వాలు, రైతులు కలిసి రూ. 1,176 కోట్లు వెచ్చించారు.
దేశంలో ఈ పరికరాలు అత్యధికంగా ఉన్న తొలి 10 జిల్లాల్లో అనంతపురం, కడప, సత్యసాయి, అన్నమయ్య, ప్రకాశం, చిత్తూరు జిల్లాలు ఉన్నాయి.