News25th Oct 03:21 PMSunil Byrisetty1 min read
ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా
ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్
ప్రవాసాంధ్రుల సంక్షేమం అభివృద్ధి, భద్రతలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏపీఎన్ఆర్టి సొసైటీ ద్వారా ప్రవాసాంధ్ర భరోసా బీమా పథకాన్ని అందిస్తోంది. ఈ పథకాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ లో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా విదేశాల్లో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉద్యోగులు, విద్యార్థులు లబ్ధి పొందవచ్చు. ఉద్యోగులు, వలస కార్మికులు, విద్యార్థుల కొరకు ఈ పథకం ప్రవేశపెట్టబడింది. బీమా చేయబడిన వ్యక్తి ప్రమాదం వల్ల మరణించినా లేదా శాశ్వత అంగవైకల్యం కలిగినా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించబడుతుంది. ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి విదేశాలకు వెళ్లిన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఈ పథకంలో నమోదు చేసుకోవడానికి https://apnrts.ap.gov.in/insurance వెబ్ సైట్ ను సందర్శించగలరు.