Education17th May 10:52 AMSunil Byrisetty1 min read
శాఖాపరమైన పరీక్షలు వాయిదా....!!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వోద్యోగుల కోసం నిర్వహించే పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీప
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వోద్యోగుల కోసం నిర్వహించే పరీక్షలు వాయిదా పడ్డాయి.
ప్రభుత్వ ఉద్యోగుల పదోన్నతుల కోసం నిర్వహించే డిపార్ట్మెంట్ పరీక్షలను వాయిదా వేస్తూ ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.
మే నెలకు సంబంధించిన పరీక్షలు జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించాలని APPSC గతంలో షెడ్యూల్ విడుదల చేసింది.
కొన్ని అనివార్య కారణాలతో ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
త్వరలోనే కొత్త తేదీలను వెల్లడిస్తామని APPSC తెలిపింది.