News5th Aug 02:33 PMSunil Byrisetty1 min read

విజయవాడ- వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ

ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి విజయవాడ - వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. భక్తులకు, పర్యాటకులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళి

విజయవాడ- వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ
ఏపీటీడీసీ ఆధ్వర్యంలో ఈనెల 8 నుండి విజయవాడ - వాడపల్లి వన్-డే టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది. భక్తులకు, పర్యాటకులకు ఇటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతమైన రవాణా, ఆహార వసతులతో ప్రణాళికాబద్ధమైన తీర్థయాత్ర అనుభవాన్ని అందించడమే లక్ష్యంగా ఈ ప్యాకేజీకి రూపకల్పన చేశారు. ఈ టూర్ ప్యాకేజీ ఉదయం 4 గంటలకు విజయవాడలోని సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ వద్ద ప్రారంభమై, తిరిగి సాయంత్రం 7 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ప్యాకేజీ ధర పెద్దలకు రూ. 1,160/-, పిల్లలకు రూ. 1,000/- గా నిర్ణయించారు. బస్సు రవాణా ఛార్జీలతో పాటు ఉదయం అల్పాహారం మరియు మధ్యాహ్న భోజన వసతి కలిగి ఉంటాయి. అయితే ఆలయ దర్శనం టికెట్ ఛార్జీలను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. ఈ యాత్రను సద్వినియోగం చేసుకోవాలనుకునే భక్తులు www.aptdc.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో గానీ, లేదా విజయవాడ బందర్ రోడ్, లెమన్ ట్రీ హోటల్ పక్కన ఉన్న సెంట్రల్ రిజర్వేషన్ ఆఫీస్ (CRO) వద్ద నేరుగా సంప్రదించాలి.
Andhra Pradesh Tourism
APTDC
Vijayawada
Vadapalli
One Day Tour
Temple Tour
తీర్థయాత్ర
టూర్ ప్యాకేజీ
పర్యాటకం
ఏపీ
Scroll for the next article