News28th Sep 11:34 AMSunil Byrisetty1 min read

అరకు కాఫీకి జాతీయ గౌరవం

అరకు వ్యాలీ కాఫీకి లభించిన జాతీయ గౌరవాన్ని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షించారు. ప్రతిష్టాత్మక బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ – 2025 లో “చేంజ్

అరకు కాఫీకి జాతీయ గౌరవం
అరకు వ్యాలీ కాఫీకి లభించిన జాతీయ గౌరవాన్ని సీఎం చంద్రబాబు, వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హర్షించారు. ప్రతిష్టాత్మక బిజినెస్ లైన్ చేంజ్ మేకర్ అవార్డ్స్ – 2025 లో “చేంజ్ మేకర్ ఆఫ్ ది ఇయర్” పురస్కారం దక్కించుకోవడం గిరిజన సమాజం గర్వించదగ్గ విషయం అని అన్నారు. జీసీసీ ఆధ్వర్యంలో గిరిజన రైతుల కృషి ఫలితంగా అరకు కాఫీ ఈ స్థాయి గుర్తింపు పొందిందని అభినందించారు. అరకు కాఫీ కేవలం ఒక బ్రాండ్ మాత్రమే కాకుండా గిరిజన సమాజం ఆత్మగౌరవానికి, ఆర్థిక స్వావలంబనకు ప్రతీక అని పేర్కొన్నారు. ఈ అవార్డు దక్కడం ద్వారా గిరిజన రైతుల శ్రమ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందని, భవిష్యత్తులో అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఇలాంటి అవార్డులు ఆంధ్రప్రదేశ్‌ గిరిజనుల కృషికి న్యాయం చేస్తాయని, భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ అవార్డులు రావాలని కోరుకుంటున్నానని వారు పేర్కొన్నారు.
Andhra Pradesh
Araku Coffee
National Award
BusinessLine Change Maker Awards
Chandrababu Naidu
Kinjarapu Atchannaidu
Tribal Farmers
కాఫీ బ్రాండ్
గిరిజన గర్వం
ఆర్థిక స్వావలంబన
భారతీయ కాఫీ
Scroll for the next article