News31st Aug 11:14 AMSunil Byrisetty1 min read
తిరుపతిలో మహిళా ఎమ్మెల్యేల సదస్సు
తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో వివరాల
తిరుపతిలో సెప్టెంబరు 14, 15 తేదీల్లో మహిళా ఎమ్మెల్యేలకు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్నపాత్రుడు తెలిపారు.
ఈ మేరకు విడుదల చేసిన వీడియోలో వివరాలు వెల్లడించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల పరిధిలో ఉన్న వివిధ పార్టీలకు చెందిన సుమారు 300 మంది మహిళా ఎమ్మెల్యేలు సదస్సుకు హాజరు కానున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమానికి తొలిరోజు సీఎం చంద్రబాబు, లోక్సభస్పీకర్ హాజరవుతారని, ముగింపు రోజున గవర్నర్ హాజరుకానున్నారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. సదస్సుకు హాజరయ్యే ఎమ్మెల్యేలకు శ్రీవారి దర్శనం కల్పించించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.