News23rd Jun 06:26 PMSunil Byrisetty1 min read
ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం సూపర
ఆగస్టు 15 నుంచి ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. గత ప్రభుత్వం మాయమాటలతో ప్రజలను మోసం చేసిందని చెప్పారు. తమ ప్రభుత్వం మాత్రం సూపర్ సిక్స్ హామీలైన పింఛన్ల పెంపు చేసి చూపించిందన్నారు. అంతే కాకుండా అన్న క్యాంటీన్, మెగా డీఎస్సీ, దీపం-2, తల్లికి వందనం పథకాలను అమలు చేసినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు.