Telangana28th Jun 05:19 PMSunil Byrisetty1 min read
మహా టీవీపై దాడిని ఖండించిన మంత్రి లోకేష్
హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని వ్యాఖ్యానిం
హైదరాబాద్ మహా టీవీ హెడ్ ఆఫీసుపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రజావాణి వినిపించే మీడియాపై దాడి ప్రజాస్వామ్యంపై దాడిగానే పరిగణించాలని వ్యాఖ్యానించారు. మహా టీవీపై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నానని పేర్కొన్నారు. కథనాలు, ప్రసారాల పట్ల అభ్యంతరాలు ఉంటే, తెలియజేయవచ్చని సూచించారు. వివరణ కోరవచ్చు, ఖండన అడగవచ్చు. ఇటువంటి దాడులు క్షమార్హం కాదని పేర్కొన్నారు. మహా యాజమాన్యానికి సంఘీభావం తెలుపుతున్నానని లోకేష్ ట్వీట్లో అన్నారు.