National20th Oct 12:25 PMSunil Byrisetty1 min read
26 లక్షల దీపాలతో, హారతితో గిన్నిస్ రికార్డులు
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జరిగిన తొమ్మిదో దీపోత్సవ వేడుకల్లో గిన్నిస్ రికార్డ్ నమోదైంది. సరయూ నదీ తీరంలో 26,17,215 దీపాలు వెలిగించి, ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించి రెండు
ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్యలో జరిగిన తొమ్మిదో దీపోత్సవ వేడుకల్లో గిన్నిస్ రికార్డ్ నమోదైంది. సరయూ నదీ తీరంలో 26,17,215 దీపాలు వెలిగించి, ఏకకాలంలో 2,128 మందితో హారతి నిర్వహించి రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను సృష్టించారు.
యూపీ ప్రభుత్వం ఈ విషయాన్ని వెల్లడించగా గిన్నిస్ ప్రతినిధులు రికార్డులను ధ్రువీకరించారు.
దీపోత్సవంలో భాగంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ శ్రీరాముడు. సీత, లక్ష్మణుల వేషధారణలో కళాకారులకు హారతి ఇచ్చి పుష్పక విమాన రథాన్ని లాగారు.
ఐదు దేశాలకు చెందిన కళాకారులు వేడుకల్లో పాల్గొన్నారు.