News4th May 10:51 AMSunil Byrisetty1 min read
పాక్ దూల తీరుస్తున్న బీఎన్ఏ!
భారత్ ను ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్ కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది. యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగ
భారత్ ను ఓడిస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్న పాకిస్థాన్ కు బలూచ్ లిబరేషన్ ఆర్మీ చుక్కలు చూపిస్తోంది.
యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్ని కోల్పోయేలా ఉంది.
బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది.
పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ విరుచుకుపడుతున్నారు.
భారత్ తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ తన బలగాలను ఎల్బీసీ, భారత్ ఇతర సరిహద్దులకు తరలించింది.
దీంతో, బీఎల్ఎ ఫైటర్స్ అక్కడ ఉన్న పాక్ ఆర్మీని ఊచకోత కోస్తున్నారు.
బీఎల్ ఏ దెబ్బకు పలువురు పాక్ సైనికులు పారిపోతున్నారు.
తాజాగా బీఎల్ఎ జరిపిన దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు.