News8th Aug 09:28 AMSunil Byrisetty1 min read
బనకచర్లపై నిపుణుల కమిటీ
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపిన బనకచర్ల అంశంపై కేంద్రం కీలక ఆలోచన చేస్తోంది. దీనిపై లోతైన అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నీటి నిర్వహణ ర
తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాన్ని రేపిన బనకచర్ల అంశంపై కేంద్రం కీలక ఆలోచన చేస్తోంది. దీనిపై లోతైన అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. నీటి నిర్వహణ రంగంలో నిపుణులైన
12 మందితో కమిటీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఏపీ, తెలంగాణ నుంచి ఐదుగురి చొప్పున పేర్లు పంపించాలని కేంద్ర జలవనరుల శాఖ కోరింది. ఇరు రాష్ట్రాల నుంచి పది మందిని ఎంపిక చేసి, కేంద్రం తరపున మరో ఇద్దరు నిపుణులకు కమిటీలో చోటు కల్పించాలని భావిస్తోంది.