News22nd Sep 10:11 AMSunil Byrisetty1 min read
దసరా సందర్భంగా బ్యాంకులకు సెలవు..
విజయదశమి సందర్భంగా ఆర్బీఐ జారీ చేసిన బ్యాంక్ హాలిడే ప్రకారం అన్ని బ్రాంచ్ లు సాధారణంగా సెలవులో ఉంటాయి. అయితే సెప్టెంబర్ 22వ తేదీ కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకు బ్రాంచీలు మూటపడతాయి.
విజయదశమి సందర్భంగా ఆర్బీఐ జారీ చేసిన బ్యాంక్ హాలిడే ప్రకారం అన్ని బ్రాంచ్ లు సాధారణంగా సెలవులో ఉంటాయి. అయితే సెప్టెంబర్ 22వ తేదీ కొన్ని ప్రాంతాల్లోనే బ్యాంకు బ్రాంచీలు మూటపడతాయి. మిగతా అన్ని రాష్ట్రాల్లో యథావిధిగా కొనసాగుతాయి. రాజస్థాన్లో ఉన్న అన్ని బ్యాంకు బ్రాంచీలకు సెలవు. నవరాత్రి మొదటి రోజు ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. అక్కడ స్కూలు, కాలేజీలకు కూడా నవరాత్రి సందర్భంగా సెలవులు ప్రకటించారు. జమ్మూ కాశ్మీర్లో కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి. 23వ తేదీ మహారాజు హరి సింగ్ జయంతి సందర్భంగా ఆరోజు కూడా బ్యాంకులు బంద్ ఉంటాయి.
సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం కాబట్టి ఆ రోజుల్లో బ్యాంకు బ్రాంచీలన్నీ దేశవ్యాప్తంగా బంద్ ఉంటాయి. అయితే బ్యాంకు బ్రాంచీలు బంద్ ఉన్న.. ఏటీఎం సర్వీస్ లు యథావిధిగా కొనసాగుతాయి.