Spiritual1st Nov 10:52 AMSunil Byrisetty1 min read
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి భవానీ దీక్షలు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నవంబర్ 1వ తేదీ నుంచి భవానీ మండల దీక్ష ధారణలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి ఆరో అంతస్తులో భవాని
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువున్న శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ రోజు నవంబర్ 1వ తేదీ నుంచి భవానీ మండల దీక్ష ధారణలు ప్రారంభమయ్యాయి. ఇంద్రకీలాద్రి ఆరో అంతస్తులో భవాని దీక్ష ధారణలకు భారీగా భక్తులు తరలి వచ్చారు.
గణపతి పూజ అనంతరం స్థానాచార్యులు,అర్చక స్వాముల పర్యవేక్షణలో దీక్ష ధారణలు ప్రారంభించారు. నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు ఐదు రోజుల పాటు జరగనున్న దీక్ష ధారణలు జరుగుతున్నాయి. నవంబర్ 21 నుంచి అర్థమండల దీక్ష ప్రారంభం కానుంది. నవంబర్ 25 తేజీ అర్థ మండల దీక్ష ధారణల సమాప్తమవుతాయి.
డిసెంబర్ 4 వ తేజీ కలశ జ్యోతి ఉత్సవం జరుగుతుంది. డిసెంబర్ 15 తేదీన భవాని దీక్ష విరమణలు పూర్తవుతాయి.