Spiritual11th Dec 11:40 AMSunil Byrisetty1 min read
నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేడు ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 6.30 గంటలకు హోమగుండాల అగ్ని ప్రతిష్టాపన జరిగింది. ఉదయం
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షల విరమణ నేడు ప్రారంభమైంది. ఈ నెల 15 వరకు భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు చేశారు. నేడు ఉదయం 6.30 గంటలకు హోమగుండాల అగ్ని ప్రతిష్టాపన జరిగింది. ఉదయం 6 గంటలకు ప్రధాన ఆలయం నుంచి జ్యోతులతో ప్రదర్శన నిర్వహించి.. ఉదయం 7 గంటల నుంచి అమ్మవారి దర్శనానికి భక్తులకు అనుమతినిచ్చారు. రేపటి నుంచి తెల్లవారుజామున 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనాలు కల్పించనున్నారు. భవానీ దీక్షల సమయంలో అంతరాలయ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే అన్ని ఆర్జిత సేవలు, టికెట్ దర్శనాలను దేవస్థానం రద్దు చేసింది. ఐదు క్యూలైన్లలో భవానీ దీక్షదారులకు ఉచిత దర్శనానికి అనుమతినిచ్చింది. భక్తుల భద్రత పర్యవేక్షణకు 320 సీసీ కెమెరాలతో నిఘాతోపాటు.. కొండ దిగువన ప్రత్యేక కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. భారీగా భక్తుల రాక దృష్ట్యా 28 వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు.