Telangana27th Oct 05:52 PMSunil Byrisetty1 min read
తెలంగాణలో కాంగ్రెస్కు బిగ్ షాక్..!
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సైతం వినూత్న ప్రచారాలతో దూసుకెళ్తోం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఒకవైపు బీఆర్ఎస్, బీజేపీ దూకుడుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ సైతం వినూత్న ప్రచారాలతో దూసుకెళ్తోంది. ఈ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ తో పాటు అతని సోదరుడు రమేశ్ యాదవ్ ను పోలీసులు బైండోవర్ చేశారు. వీరితో పాటు 170 మంది రౌడీ షీటర్లను బైండోవర్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.