Politics26th Jun 11:08 AMSunil Byrisetty1 min read
పీకే పార్టీకి 'స్కూల్ బ్యాగ్'
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ ఇచ్చింది. పీకే స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి ఎలక్షన్స్ కమిషన్ గుర్తును కేటాయించింది. 'స్కూల్ బ్యాగ్
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) పార్టీకి ఎన్నికల కమిషన్ సింబల్ ఇచ్చింది. పీకే స్థాపించిన 'జన్ సురాజ్' పార్టీకి ఎలక్షన్స్ కమిషన్ గుర్తును కేటాయించింది. 'స్కూల్ బ్యాగ్' గుర్తుపై బిహార్లోని 243 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ పార్టీ బరిలోకి దిగనుంది. గత ఏడాది అక్టోబర్ 2న ప్రశాంత్ కిశోర్ ఈ పార్టీని స్థాపించగా, 8 నెలల తర్వాత ఈసీ గుర్తును కేటాయించింది. షెడ్యూల్ ప్రకారం బిహార్ ఎలక్షన్స్ ఈ ఏడాది అక్టోబర్, నవంబర్లో జరగనున్నాయి.