TTD26th Nov 04:34 PMSunil Byrisetty1 min read
టీటీడీకి రూ.9 కోట్ల భారీ విరాళమిచ్చిన బిలియనీర్
బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. ఇటీవల ఉదయ్ పూర్లో ఆయన అట్టహాసంగా తన కుమార్తె వివాహం జరిపించారు. అనంతరం తిరుమల విచ్చేసి, PAC 1,2,3 భవనాల ఆధుని
బిలియనీర్ మంతెన రామలింగరాజు తిరుమల శ్రీవారికి భారీ విరాళం ప్రకటించారు. ఇటీవల ఉదయ్ పూర్లో ఆయన అట్టహాసంగా తన కుమార్తె వివాహం జరిపించారు. అనంతరం తిరుమల విచ్చేసి, PAC 1,2,3 భవనాల ఆధునికీకరణ కోసం కుమార్తె నేత్ర, అల్లుడు వంశీ పేరిట రూ.9 కోట్లు విరాళం అందజేశారు. ఈ మేరకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. రామలింగరాజు 2012లోనూ శ్రీవారికి రూ.16 కోట్ల భారీ విరాళం ఇచ్చారు. ఇటీవల ఆయన కూతురి వివాహానికి ట్రంప్ కుమారుడు సహా హాలీవుడ్ దిగ్గజాలు తరలివచ్చిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.