News31st Jan 04:44 PMSunil Byrisetty1 min read
అమరావతిలో "బిట్స్ పిలానీ" క్యాంపస్
ప్రజారాజధాని అమరావతి ఉన్నత విద్యకు కేంద్రంగా రూపుదిద్దుకునే క్రమంలో కీలకమైన ముందడుగు పడింది. ప్రముఖ యూనివర్సిటీ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (BITS) అమరావతిలో 7
ప్రజారాజధాని అమరావతి ఉన్నత విద్యకు కేంద్రంగా రూపుదిద్దుకునే క్రమంలో కీలకమైన ముందడుగు పడింది. ప్రముఖ యూనివర్సిటీ అయిన బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ (BITS) అమరావతిలో 70.011 ఎకరాలలో తన క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. బిట్స్ సంస్థకు తుళ్లూరు మండలంలోని మందడం, వెంకటపాలెంలో రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించింది. ఈ మేరకు సీఆర్డీయేతో బిట్స్ సంస్థ ప్రతినిధులు భూ విక్రయ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. బిట్స్ అమరావతి క్యాంపస్ను మూడు దశలుగా అభివృద్ధి చేయనున్నట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. మొదటి దశలోనే సుమారు రూ.1,000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో క్యాంపస్ పనులు ప్రారంభించనున్నామన్నారు. ఆధునిక మౌలిక వసతులతో కూడిన స్మార్ట్ భవనాలు, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, ఆధునిక బోధన పద్ధతులు, పర్యావరణహిత నిర్మాణాలతో ఈ క్యాంపస్ను కొత్త తరం విజ్ఞాన కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 2027 నుంచి అమరావతి క్యాంపస్లో విద్యార్థులకు ప్రవేశాలు లభించేలా పనులు వేగంగా పూర్తి చేస్తామన్నారు. దశలవారీగా పదివేల మంది విద్యార్థులు బిట్స్ క్యాంపస్లో విద్యను అభ్యసించేలా కార్యకలాపాలు నిర్వహిస్తామన్నారు.