News5th Aug 09:58 AMSunil Byrisetty1 min read

గుంటూరులో బీజేపీ చాయ్ పే చర్చ

బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరులో చాయ్ పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఉందన్నారు. ప్రపంచంలో ఏ నేత ఆలోచించని వ

గుంటూరులో బీజేపీ చాయ్ పే చర్చ
బిజెపి ఆంధ్ర ప్రదేశ్ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గుంటూరులో చాయ్ పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఉందన్నారు. ప్రపంచంలో ఏ నేత ఆలోచించని విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఈ చాయ్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. మోడీ ఆలోచనతో మోడీ కాలనీ తయారు చేయడం జరిగిందని చెప్పారు. ఆ కాలనీలో సీసీ కెమెరాలు, చక్కటి పారిశుధ్యం, లైటింగ్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గుంటూరులో జిన్నా టవర్స్ పేరును మార్చుతామని పేర్కొన్నారు.
Andhra Pradesh news
BJP
PVN Madhav
Chai Pe Charcha
Guntur
Narendra Modi Vision
Jinnah Towers Renaming
గుంటూరు బీజేపీ
జిన్నా టవర్స్ పేరు మార్పు
Scroll for the next article