Telangana22nd Aug 02:13 PMSunil Byrisetty1 min read
రైతు ఇంట్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి బస!
తెలంగాణ బీజేపీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజలను ఆకట్టుకునే వ్యూహాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాంచందర్ రావు తనదైన మార్క్ చూపిస్తున్
తెలంగాణ బీజేపీ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ప్రజలను ఆకట్టుకునే వ్యూహాలతో దూసుకెళ్తోంది. ఇటీవల పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రాంచందర్ రావు తనదైన మార్క్ చూపిస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రాంచందర్ రావు ఒక రైతు ఇంట్లో బస చేశారు. ఈ ఘటన చేవెళ్ల మండలం ఖానాపూర్ లో 'పల్లె పల్లెకు బీజేపీ' అనే కార్యక్రమంలో జరిగింది. ఈరోజు ఆలూర్ గ్రామంలో మహిళా సమావేశంలో పాల్గొననున్నారు. చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కె.ఎస్.రత్నం, జిల్లా అధ్యక్షుడు రాజ్ భూపాల్ కూడా ఆయన వెంట ఉన్నారు.