Telangana18th Dec 03:07 PMSunil Byrisetty1 min read

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు

హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన

నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు
హైదరాబాద్ నగరంలోని నాంపల్లి సీబీఐ కోర్టుకు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం రెండు గంటలకు కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుందని ఆ సందేశంలో పేర్కొన్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు న్యాయమూర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులను కోర్టు నుంచి బయటకు పంపించి, బాంబు నిర్వీర్య దళాలతో తనిఖీలు చేపట్టారు. కోర్టు లోపల, పరిసర ప్రాంతాల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. గుర్తు తెలియని వ్యక్తుల నుండి వచ్చిన ఈ బెదిరింపు సందేశంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కోర్టు ప్రాంగణంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. బెదిరింపులకు పాల్పడిన వారిని గుర్తించేందుకు సైబర్ క్రైమ్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
Hyderabad News
Bomb Threat
Email Threat
Nampally CBI Court
Police Investigation
Cyber Crime Police
Court Security
సైబర్ క్రైమ్ పోలీసులు
కోర్టు భద్రత
తెలంగాణ
బ్రేకింగ్ న్యూస్
లా అండ్ ఆర్డర్
Scroll for the next article