Politics5th Nov 04:22 PMSunil Byrisetty1 min read
చంద్రబాబువన్నీ ఉత్తి మాటలే: బొత్స
ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కన్పించడం లేదని బొత్స ఆరోపించారు. మొంథా తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారన
ఏపీలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శలు చేశారు. రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కన్పించడం లేదని బొత్స ఆరోపించారు. మొంథా తుఫాన్తో రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వం పంట నష్టం ఇన్సూరెన్స్ చెల్లించి ఉంటే.. రైతులకు నష్టం పూర్తిగా భర్తీ అయ్యేదన్నారు. కానీ.. ఇన్సూరెన్స్ను ఇప్పటికీ చెల్లించలేదన్నారు. సీఎం, మంత్రులు మాటలు చెబుతున్నారని, కానీ చేతల్లో చూపించడం లేదన్నారు. రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.