News20th Aug 12:03 PMSunil Byrisetty1 min read
డోకిపర్రులో గ్రామీణ మహిళల కోసం బ్రెస్ట్ కాన్సర్ స్క్రీనింగ్ కేంద్రం ప్రారంభం
గ్రామీణ మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ స్థాయి మహిళా ఐక్యతకు నిదర్శనంగా, దాతృత్వవేత్త సుధా రెడ్డి, మిస్ వరల్డ్ 2025 ఒపల్ సుచాటా చువాంగ్స్రీ, మిస్ ఆసియా 2025 క్రిష్ణా గ్రావిడెజ్ సం
గ్రామీణ మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం ప్రపంచ స్థాయి మహిళా ఐక్యతకు నిదర్శనంగా, దాతృత్వవేత్త సుధా రెడ్డి, మిస్ వరల్డ్ 2025 ఒపల్ సుచాటా చువాంగ్స్రీ, మిస్ ఆసియా 2025 క్రిష్ణా గ్రావిడెజ్ సంయుక్తంగా డోకిపర్రు గ్రామంలో అత్యాధునిక సాంకేతికతతో కూడిన బ్రెస్ట్ కాన్సర్ స్క్రీనింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. సుధా రెడ్డి ఫౌండేషన్, MEIL ఫౌండేషన్ సహకారంతో ఏర్పాటైన ఈ కేంద్రం గ్రామీణ ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బ్రెస్ట్ కాన్సర్ స్క్రీనింగ్, ప్రాథమిక నిర్ధారణ సేవలను అందిస్తుంది. భారతదేశంలో మహిళల మరణాలకు కారణమవుతున్న బ్రెస్ట్ కాన్సర్ను ఎదుర్కొనే లక్ష్యంతో ఈ కేంద్రం స్థాపించబడింది.ప్రారంభోత్సవంలో గ్రామస్థులు, స్థానిక నాయకులు, మహిళా ఆరోగ్య కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు. సుధా రెడ్డి మాట్లాడుతూ, “ఇది కేవలం ఆరోగ్య కేంద్రం కాదని, ప్రాణాలను కాపాడే మిషన్ అని, ముందస్తు గుర్తింపు బ్రెస్ట్ కాన్సర్ను ఎదుర్కొనే శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఈ సేవలను గ్రామీణ ప్రాంతాలకు తీసుకొచ్చి, ఎవరూ వెనుకబడకుండా చూస్తున్నామని వివరించారు.