News23rd Apr 03:22 PMSunil Byrisetty1 min read
ఉగ్రదాడిని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా క్యాండిల్స్ ర్యాలీ
కశ్మీర్లో ఉగ్రదాడి అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు. ఈ దుర్ఘటనలో అశువులు బాసిన కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ ఈరోజు సాయ
కశ్మీర్లో ఉగ్రదాడి అందరినీ దిగ్ర్భాంతికి గురిచేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి అన్నారు.
ఈ దుర్ఘటనలో అశువులు బాసిన కుటుంబాలకు సానుభూతి తెలియచేస్తూ ఈరోజు సాయంత్రం క్యాండిల్స్ ర్యాలీ చేయాలని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
క్యాండిల్స్ ర్యాలీ రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తున్నందున అన్ని సంస్థలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయాలన్నారు.
మృతులలో విశాఖకు చెందిన వారు ఉన్నందున బీజేపీ నాయకులు ఆ కుటుంబానికి అండగా ఉండాలని కోరారు.
ఎయిర్ పోర్ట్ నుంచి చంద్రశేఖర్ భౌతిక కాయాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు పార్టీ నేతలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నారన్నారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తూ, క్యాండిల్స్ ర్యాలీ చేయాలని పిలుపునిచ్చారు