News9th Aug 04:09 PMSunil Byrisetty1 min read
స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో సీఏలు కీలకం
మంగళగిరిలోని CK కన్వెన్షన్లో నిర్వహించిన ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలి (SIRC) 58వ రెండు రోజుల కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన CA లంకా దినకర్, చైర్మన్, ఇర
మంగళగిరిలోని CK కన్వెన్షన్లో నిర్వహించిన ICAI దక్షిణ భారత ప్రాంతీయ మండలి (SIRC) 58వ రెండు రోజుల కాన్ఫరెన్స్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన CA లంకా దినకర్, చైర్మన్, ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు, దేశ నిర్మాణంలో, రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్ర అత్యంత కీలకమని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ “వికసిత్ భారత్ @2047” లక్ష్యం, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు “స్వర్ణ ఆంధ్రప్రదేశ్ @2047” దార్శనికతను ఆచరణాత్మకంగా, ఫలితాల ఆధారంగా అమలు చేయడంలో CAల వృత్తి నైపుణ్యం ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. “వికసిత్ భారత్ @2047 అనేది కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదు. దేశంలోని ప్రతి రంగం, సంస్థ, వృత్తి నిపుణుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాల్సిన జాతీయ సంకల్పం. అదేవిధంగా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ @2047 అనేది ఆంధ్రప్రదేశ్ను సంపన్నమైన, ప్రగతిశీల, సాంకేతిక ఆధారిత, ప్రపంచ స్థాయి పోటీతత్వం కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే మహత్తర లక్ష్యం. ఈ పరివర్తనాత్మక ప్రయాణంలో చార్టర్డ్ అకౌంటెంట్ల బాధ్యత ఎంతో కీలకం.” అని పేర్కొన్నారు.