Politics13th Mar 11:42 AMSunil Byrisetty1 min read
ఆ కేసుల నుంచి టీడీపీ నేతలకు విముక్తి
టీడీపీ నేతలు గతంలో చేసిన ఆందోళనలపై నమోదైన కేసులను విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది. ఓబులాపురం మైనింగ్పై గతంలో టీడీపీ నేతలు ఆందోళనలు చేయగా కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ
టీడీపీ నేతలు గతంలో చేసిన ఆందోళనలపై నమోదైన కేసులను విజయవాడలోని ప్రజాప్రతినిధుల కోర్టు కొట్టివేసింది.
ఓబులాపురం మైనింగ్పై గతంలో టీడీపీ నేతలు ఆందోళనలు చేయగా కేసులు నమోదయ్యాయి.
ఈ నేపథ్యంలో పలువురు టీడీపీ నేతలు విజయవాడ ప్రజాప్రతినిధుల కోర్టులో వాయిదాలకు హాజరవుతున్నారు.
ఈ కేసు విచారణకు సంబంధించి గురువారం కూడా టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, చినరాజప్ప, ధూళిపాళ్ల నరేంద్ర, జనార్దన్రెడ్డి, తదితరులు విచారణకు హాజరయ్యారు. గత కొన్నేళ్లుగా విచారణకు హాజరవుతున్న నాయకులకు కేసు కొట్టివేతతో విముక్తి లభించినట్లయింది.