News11th Sep 01:11 PMSunil Byrisetty1 min read
అక్టోబరు 2 నుంచి ఇంటికే కుల ధ్రువీకరణ పత్రం
ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే పత్రాన్ని పంపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్
ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఇంటికే పత్రాన్ని పంపేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కుల ధ్రువీకరణ పత్రం కోసం ఇకపై కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా.. అక్టోబరు 2 నుంచి ఇంటికే పత్రం వస్తుంది. కూటమి ప్రభుత్వం ప్రజల కోసం ఈ కొత్త ఆలోచన చేసింది. చదువు, ఉపకార వేతనాలు, ఉద్యోగం, అభివృద్ధి, సంక్షేమ పథకాల కోసం ఈ పత్రం ఉపయోగపడుతుంది. గతంలో కుల ధ్రువీకరణ పత్రం కావాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేది. సచివాలయం, రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ అవసరం లేదు. రెవెన్యూ శాఖ ఈ పనిని సులభతరం చేస్తోంది. ఏపీ ప్రభుత్వం కుటుంబాల సర్వేలో వివరాలు సేకరించగా.. వాటి ప్రకారం కుల ధ్రువీకరణ పత్రాల పునఃపరిశీలన చేస్తున్నారు.