Education13th May 12:18 PMSunil Byrisetty1 min read
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత రికార్డు స్థాయి
దేశవ్యాప్తంగా సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాల్లో 88.39 శాతం ఉత్తీర్ణత నమోదైంది. విజయవాడ రీజియన్లో అత్యధికంగా 99.60 శాతం ఉత్తీర్ణత రికార్డు స్థాయిలో నమోదైంది.
తిరువనంతపురం రీజియన్లో 99.32 శాతం, చెన్నె రీజియన్లో 97.39 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
అలాగే బెంగళూరు రీజియన్లో 95.95 శాతం, ఢిల్లీ వెస్ట్ రీజియన్లో 95.37 శాతం, ఢిల్లీ ఈస్ట్ లో 95.06 శాతం ఉత్తీర్ణత నమోదైంది.
ప్రయాగ్ రాజ్లో అత్యల్పంగా 79.53 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ప్రకటించారు.