International19th Oct 12:11 PMSunil Byrisetty1 min read
సీజ్ ఫైర్కు అంగీకరించిన పాక్- అఫ్గాన్
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్కు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్య వర్తిత్వంతో దోహా వేదికగా ఇరుదేశాల మధ్య సాగిన చర్చలు ఫలించాయి. ఇరు
పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు చల్లబడ్డాయి. ఇరు దేశాలు సీజ్ ఫైర్కు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్య వర్తిత్వంతో దోహా వేదికగా ఇరుదేశాల మధ్య సాగిన చర్చలు ఫలించాయి. ఇరుదేశాలు 48 గంటల తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించాయని ఖతార్ విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అఫ్ఘనిస్తాన్ సరిహద్దులో కార్యకలాపాలు సాగిస్తున్న ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా మాత్రమే తాము దాడులు చేశామని పాక్ సమర్థించుకుంది. అయితే 48 గంటల తర్వాత సీజ్ ఫైర్ కొనసాగుతుందా లేక యుద్ధం కొనసాగుతుందా అనేది చూడాల్సి ఉంది.