Politics16th Jun 03:15 PMSunil Byrisetty1 min read
జనగణనపై కేంద్రం గెజిట్!
దేశవ్యాప్త జనగణనపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో రెండు విడతల్లో జనగణన నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం తీసుకుంది. జమ్ము
దేశవ్యాప్త జనగణనపై కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలో రెండు విడతల్లో జనగణన నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే జనగణనతో పాటు కులగణనకు నిర్ణయం తీసుకుంది. జమ్ముకశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్, లడఖ్లో 2026 అక్టోబర్ 1 నాటికి జనగణన ముగియనుంది. 2027 మార్చి 1వ తేదీ నాటికి మొత్తం జనగణన పూర్తి కానుంది. 2021లో జరగాల్సిన జనగణన కోవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో పూర్తి కానుంది.