News23rd May 03:29 PMSunil Byrisetty1 min read
కేంద్రం ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింద
కేంద్రం కేటాయించే ఇళ్లలో దివ్యాంగులకు 4 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు కేంద్ర గృహనిర్మాణ పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉన్న నివాసాల్లో దివ్యాంగుల హక్కులను గుర్తించి, సమానత, గౌరవం, యాక్సెస్ అంశాలను బలోపేతం చేయడానికి గల ప్రధాన చర్యగా భావిస్తున్నారు.
ఈ నిర్ణయంతో దివ్యాంగులకు రిజర్వేషన్ ప్రకారం ఇళ్లు దక్కనున్నాయి.
తద్వారా సొంతిల్లు లేని దివ్యాంగులకు పక్కా ఇల్లు లభిస్తుంది.