National4th Jul 01:29 PMSunil Byrisetty1 min read
దేశవ్యతిరేక పోస్టులు పెడితే.. తాట తీస్తారు!
కేంద్ర హోం శాఖ కొత్త పాలసీ తేబోతోంది. ఈ పాలసీ గనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ పాలసీలో భాగంగా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో
కేంద్ర హోం శాఖ కొత్త పాలసీ తేబోతోంది. ఈ పాలసీ గనుక అమలైతే దేశానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి చుక్కలు కనిపించనున్నాయి. ఈ పాలసీలో భాగంగా దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పెట్టే వీడియో, ఇతర కంటెంట్ను గుర్తించనున్నారు. వాటిని బ్లాక్ చేయనున్నారు. ఆ కంటెంట్ పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. దేశానికి వ్యతిరేకంగా కంటెంట్ ఉండే వెబ్ సైట్లపై కూడా చర్యలు ఉండనున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలోని అత్యున్నతాధికారులు యాంటీ నేషనల్ పోస్టుల గురించి హోమ్ మినిస్ట్రీకి చెప్పారట. ఈ నేపథ్యంలోనే కేంద్ర కొత్త పాలసీ తేవాలని చూస్తోందట. దేశానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని, వ్యతిరేకంగా పని చేసే వారిని గుర్తించడానికి కేంద్రం ఓ టీమ్ను ఏర్పాటు చేయనుంది. ఈ టీమ్ దేశ వ్యతిరేక కార్యాకలాపాలపై దృష్టి పెడుతుంది.