News1st Dec 04:30 PMSunil Byrisetty1 min read

గుట్కా, పాన్ మసాలా పరిశ్రమపై కేంద్రం కొరడా!

గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్

గుట్కా, పాన్ మసాలా పరిశ్రమపై కేంద్రం కొరడా!
గుట్కా, పాన్ మసాలా పరిశ్రమను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కీలక చట్టాన్ని తీసుకురాబోతోంది. ‘హెల్త్ సెక్యూరిటీ టు నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్, 2025’ పేరుతో రూపొందించిన ఈ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త చట్టం ప్రకారం, గుట్కా, పాన్ మసాలా వంటి పొగాకు ఉత్పత్తులపై పన్ను విధించే విధానం పూర్తిగా మారనుంది. ఇప్పటివరకు తుది ఉత్పత్తి ఆధారంగా పన్ను విధిస్తుండగా, ఇకపై వాటి తయారీకి ఉపయోగించే యంత్రాల ఉత్పత్తి సామర్థ్యం ఆధారంగా ప్రత్యేక సెస్సు విధించనున్నారు. చేతితో తయారుచేసే యూనిట్లకు కూడా ప్రతినెలా తప్పనిసరిగా నిర్దిష్ట మొత్తంలో సెస్సు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త విధానంలో, ఉత్పత్తి ఎంత జరిగిందనే దానితో సంబంధం లేకుండా ప్రతి నెలా తయారీదారులు సెస్సు చెల్లించాలి. ఒకవేళ యంత్రాలు లేదా యూనిట్ 15 రోజులకు మించి పనిచేయకపోతే మాత్రమే మినహాయింపు లభిస్తుంది. ప్రతి తయారీదారు తప్పనిసరిగా ప్రభుత్వంతో రిజిస్టర్ చేసుకోవాలి, నెలవారీ రిటర్న్స్ దాఖలు చేయాలి. అధికారులు ఎప్పుడైనా తనిఖీలు, విచారణ, ఆడిట్ చేసేందుకు వీలు కల్పించాలి. ఈ నిబంధనల ఉల్లంఘనకు ఐదేళ్ల వరకు జైలు శిక్ష, భారీ జరిమానాలు విధించేలా బిల్లులో ప్రతిపాదనలు ఉన్నాయి.
India News
Gutka
Pan Masala
Tobacco Industry
Health Security
National Security
Nirmala Sitharaman
జాతీయ భద్రత
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు
Scroll for the next article